AMARAVATHI

పథకం ప్రకారం“వందే భారత్ ఎక్స్ ప్రెస్”పై రాళ్ల దాడి

అమరావతి: అధునిక సౌకర్యలతో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన “వందే భారత్ ఎక్స్ ప్రెస్”పై దుండగులు మరోసారి రాళ్ల దాడి చేశారు..కేరళలో ఏప్రిల్ 25వ తేదిన తిరువనంతపురం సెంట్రల్ స్టేషన్‌లో తొలి వందేభారత్ ఎక్స్‌ ప్రెస్‌ను ప్రధాని నరేంద్ర మోడీ జెండా ఊపి ప్రారంభించారు..అధికారులు తెలిపిన వివరాల ప్రకారం గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు రువ్వడంతో, రైలు కిటికీ అద్దాలు దెబ్బతిన్నాయి..ఈ రైలు తిరునవయ-తిరూర్ మధ్య ప్రయాణిస్తుంది..కాసర్‌గోడ్‌ నుంచి తిరువనంతపురం తిరుగు ప్రయాణంలో వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది..ఈ ఘటన (మే1వ తేదిన) సోమవారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో జరిగినట్టు దక్షిణ మధ్య రైల్వేఅధికారులు తెలిపారు..సంఘటనపై పోలీసులకు సమాచారం అందించామని, దుండగుల జాడ కోసం దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు..ఈ సంఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని రైల్వేఅధికారులు స్పష్టం చేసింది..రాళ్ల దాడి చేసిన ఘటనపై కేసు నమోదు చేశామని,,రైలు భద్రతను పటిష్టం చేయాలని నిర్ణయించినట్టు పేర్కొన్నారు.. పథకం ప్రకారం:- తెలుగు రాష్ట్రాల్లో వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ ప్రారంభంమైనప్పటి నుంచి గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు రువ్వడం గత మూడు నెలల్లోనే ఇది 3వ సారి కావడం ఆందోళనకు గురి చేస్తోంది..ఈలాంటి సంఘటనలే కేరళలో చోటు చేసుకోవడం చూస్తుంటే,ఒక పథకం ప్రకారం వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌పై రాళ్ల దాడులు జరుగుతున్నట్లు స్పష్టం అవుతొంది.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *