AMARAVATHINATIONAL

సిక్కింలో అకస్మాత్తుగా క్లౌడ్ బరస్ట్-23 మంది ఆర్మీ సిబ్బంది గల్లంతు

అమరావతి: ఉత్తర సిక్కింలోని లొనాక్ సరస్సుపై బుధవారం అకస్మాత్తుగా క్లౌడ్ బరస్ట్ వల్ల వరదలు వెల్లువెత్తడంతో తీస్తా నదిలో నీటి మట్టాలు అకస్మాత్తుగా పెరిగాయి..నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు కురుస్తున్నాయి.. క్లౌడ్ బరస్ట్ కారణంగా కొన్ని నిమిషాల్లోనే పెను విలయాన్ని సృష్టిస్తూ ఒక్కసారిగా వరద పోటెత్తింది.. నీటి మట్టం ఒక్కసారిగా 15 నుంచి 20 అడుగుల మేర పెరిగింది,.ఆకస్మిక వరదలు సంభవించడంతో పలు రోడ్లు, వంతెనలు ధ్వసం అయ్యాయి.. సింగ్టామ్ సమీపంలోని బర్దంగ్ వద్ద పార్క్ చేసిన ఆర్మీ వాహనాలు వరద ప్రవాహంలో కొట్టుకుపోయాయి..23 మంది ఆర్మీ సిబ్బంది గల్లంతు అయ్యారు.. వారి ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి..ఆకస్మిక వరదలతో లాచెన్ లోయ వెంబడి ఉన్న అనేక ఆర్మీ స్థావరాలకు కూడా భారీ నష్టం జరిగినట్లు సమాచారం..పశ్చిమ బెంగాల్- సిక్కింను కలిపే జాతీయ రహదారి 10లోని పలు భాగాలు కొట్టుకుపోయాయి..ఆకస్మిక వరదల నేపథ్యంలో చాలా రోడ్లు మూసివేశారు..సిక్కిం ప్రభుత్వం రాష్ట్రంలో హై అలర్ట్ ప్రకటించింది..

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *