విశాఖపట్నంలో తహసీల్దార్ దారుణ హత్య
అమరావతి: విశాఖపట్నం నగరంలోని మధురవాడలో తహసిల్దార్ గా బాధ్యతలు చేపట్టిన రోజే ఆయన ఇంట్లోనే దుండగులు దారుణంగా హత్యచేశారు.. సార్వత్రిక ఎన్నికలు రానున్న సందర్బంగా ఉన్నతధికారులు సిబ్బందిని బదలీలు చేస్తున్నారు..ఈ నేపథ్యంలో చినగదిలి రూరల్ తహసీల్దార్ గా ఉన్న సనపల.రమణయ్య ఇటీవల విజయనగరం జిల్లాలోని బంటుపల్లికి బదిలీ అయ్యారు.. శుక్రవారం ఉదయం బాధ్యతలు చేపట్టిన ఆయన కొమ్మాదిలోని ఒక ఆపార్టమెంట్ 5వ అంతస్తులో వున్న తన ఇంటికి చేరుకున్నారు.. రాత్రి 10.15 గంటల సమయంలో ఫోన్ రావడంతో కిందకు వచ్చి అపార్ట్ మెంట్ గేట్ వద్ద ఓ వ్యక్తిని కలిసినట్లు సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డు అయింది..ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకొవడంతో, దుండగుడు తనతో తెచ్చుకున్న ఇనుపరాడ్ తో రమణయ్య తలపై దారుణంగా కొట్టాడు..ఇది చూసిన అపార్ట్ మెంట్ వాచ్ మెన్ కేకలు వేయడంతో,,అగంతకుడు అక్కడి నుంచి పరారయ్యాడు.. తీవ్రంగా గాయపడిన రమణయ్య అక్కడికక్కడే కుప్పకూలిపోయారు..వెంటనే స్థానికులు ఆసుపత్రికి తరలించారు..చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున 3 గంటలకు ఆయన మృతి చెందారు.. రమణయ్య సొంత వూరు, శ్రీకాకుళం జిల్లా మండలం దిమ్మిలాడ.. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.. రమణయ్య విధుల్లో చేరి 10 సంవత్సరాల క్రిందట ఉద్యోగంలో చేరి,,డిప్యూటీ తహసీల్దార్, తహసీల్దార్, కలెక్టరేట్లో ఏవోగా పనిచేశారు..ఈ సంఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.