AMARAVATHIDISTRICTSPOLITICS

గాంధీ జయంతి నుంచి జిల్లాలో టీడీపీ, జనసేనలు కలిసి పనిచేస్తాయి-ఇరు పార్టీలు నేతలు

ఐక్య కార్యాచరణ పై చర్చ…

నెల్లూరు: తెలుగుదేశం, జనసేన పార్టీల పొత్తులో భాగంగా బుధవారం మాజీ మంత్రివర్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, టీడీపీ బృందం,  జనసేన జిల్లా పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు మనుక్రాంత్ రెడ్డి, జనసేన బృందంతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు..ఈ సందర్భంగా వారు ఐక్య కార్యాచరణ పై చర్చించుకున్నారు. సైకో పాలన నుంచి ప్రజలకు విముక్తి కలిగించేందుకు భవిష్యత్తులో జిల్లాలో కలిసి పోరాటాలు చేయాలని తీర్మానించారు.టీడీపీతో కలిసి పనిచేస్తామని,,ప్రజా పరిరక్షణ కోసం పోరాడుతామని జనసేన నాయకులు తెలిపారు.

సోమిరెడ్డి:- 6 లక్షల కోట్లు అవినీతి అని చెప్పి,చివరకు కొండను తోవ్వి ఎలుకను పట్టారని ఎద్దేవా చేశారు.. జైల్లో చంద్రబాబును కలసి పవన్ కళ్యాణ్ రీల్ హీరోనే కాదు రియల్ హీరో అని నిరూపించుకురని అన్నారు..సోషల్ మీడియా ద్వారా మా మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు..ప్రజాస్వామ్యంన్ని కాపాడేందుకు రేపు వామపక్షలు, బిజెపిని కలుస్తామని,,ప్రజాస్వామ్యం కాపాడేందుకు ఈ రోజు నుంచే కలసి పోరాడుతామన్నారు..

ఆనం.రామనారాయణ:- సంప్రదాయ బద్దంగా జనసేన నేతలను కలసి పోరాటం చేసేందుకు ముందుకు వెళ్తున్నమని,, జిల్లా,మండల,గ్రామ స్థాయిలో మంచి సాంకేతాలు ఇచ్చేందుకే మా కలయిక అన్నారు.ఈ రాష్ట్రంలో అధికార అహంహారంతో క్రిమినల్ బేస్ ప్రభుత్వం నడుస్తుందని,,అధికారాన్ని అడ్డుపెట్టుకొని కేసులు, వేధింపులు చేస్తున్నారని మండిపడ్డారు..ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకే జనసేన, టిడిపి కలయిక అని,,ఇవాళ కలసిన ఈ కలయిక రాజ్యాంగాన్ని నిలబెట్టేంత వరకు కలసి పని చేస్తామన్నారు.

జనసేన,మనుక్రాంత్:- రాబోయే ఎన్నికల్లో కలిసి పోరాడుతామని, చంద్రబాబు అరెస్ట్ అక్రమం అని,, అరెస్ట్ జరిగిన తీరును ఖండిస్తున్నామన్నారు. రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతుందని ఆరోపంచారు. వై నాట్ 175 నుంచి నో మోర్ జగన్మోహన్ రెడ్ది అని ప్రజలు అంటున్నరని,,జనసేన,టిడిపి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు.ఈ కార్యక్రమంలో జనసేన,టడీపీ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

 

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *