AMARAVATHI

IAS,IPS అధికారిణిలపై బదలీ వేటు

అమరావతి: సోషల్ మీడియా వేదికగా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ కీచులాట దిగిన IAS రోహిణి సింధూరి, IPS రూప మౌద్గిల్ పై కర్ణాటక ప్రభుత్వం మంగళవారం బదిలీ వేటు వేసింది.. వీరిద్దరికీ పోస్టింగ్ ఇవ్వకుండా ట్రాన్స్ఫర్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దేవాదాయశాఖ కమిషనర్ గా ఉన్న సింధూర స్థానంలో బసవ రాజేంద్రను నియమించింది..అలాగే కర్ణాటక హస్తకళల అభివృద్ధి కార్పొరేషన్ ఎండిగా ఉన్న రూప మౌద్గిల్ స్థానంలో భారతిని నియమిస్తున్నట్లు వెల్లడించింది.ఇదే సమయంలో రూపామౌద్గిల్, భర్త మునీశ్ ను సైతం బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సర్వే సెటిల్మెంట్ ల్యాండ్ రికార్డు విభాగంలో ఉన్న వినీశ్ ను సిబ్బంది వ్యవహారాల శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శిగా బదలీ చేసింది.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *