ఉపాధ్యాయ ఎమ్మెల్సీ షేక్ సాబ్జి దుర్మరణం
అమరావతి: పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం చెరుకువాడ వద్ద శుక్రవారం ఉధయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఉభయగోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ షేక్ సాబ్జి మరణించారు..రెండు కార్లు ఎదురు ఎదురుగా వచ్చి ఢీ కొనడంతో కారులో ప్రయాణిస్తున్న ఎమ్మెల్సీ షేక్ సాబ్జి అక్కడికక్కడే మృతి చెందారు..అంగన్వాడీలు చేస్తున్న ధర్నాకు మద్దతు తెలిపేందుకు ఎమ్మెల్సీ షేక్ సాబ్జి ఏలూరు నుండి భీమవరం వెళుతున్నారు. మార్గంమధ్యలో రోడ్డు ప్రమాదం జరిగింది.