AMARAVATHIPOLITICS

టీడీపీ కుండువా కప్పుకున్న వైసీపీ ఎమ్మెల్యేలు

అమరావతి: అధికార పార్టీలో రెబల్ ఎమ్మెల్యేలుగా వున్న ఉండవల్లి శ్రీదేవి,,ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిలు శుక్రవారం మంగళగిరి టిడిపి కేంద్ర కార్యాలయంలో టిడిపి జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు..ఈ సందర్బంలో చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్రాని కాపాడేందుకే తెలుగుదేశం-జనసేనపార్టీలు కలిసి ఎన్నికలకు వస్తున్నాయని అన్నారు..వైసీపీ అధికారం నుంచి దూరమైయ్యేందుకు కేవలం 3 నెలల మాత్రమే వుందన్నారు.. జనవరి నుంచి ఫ్యాన్ రెక్కలు విరిగిపోవడం మొదలు అవుందన్నారు..అన్ని సంప్రదాయాలను సర్వనాశనం చేసిన దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి అంటూ మండిపడ్డారు..ఎంత మంది అభ్యర్దులను మార్చినా వైకాపాను ఓడించాలని ప్రజలు ఎప్పుడో నిర్ణయించుకున్నారని అన్నారు..ఎమ్మెల్యేల అనుచరులు కూడా భారీ సంఖ్యలో టీడీపీలో చేరారు..మాజీ ఎమ్మెల్సీ బూదాటి రాధాకృష్ణయ్య, రామచంద్రాపురం, తంబళ్లపల్లి, ఉదయగిరి, తాడికొండ, మంత్రాలయం, కోవూరు నియోజకవర్గాలకి చెందిన వైసిపి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున టిడిపిలో చేరారు..నేతల చేరికలతో టీడీపీ కేంద్ర కార్యాలయం అయిన ఎన్టీఆర్ భవన్ సందడిగా మారింది.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *