AMARAVATHINATIONAL

తమ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు రేపటి తరం ప్రగతికి పూనాదులు-ప్రధాని మోదీ

అమరావతి: తమ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, దేశ భవిష్యత్ కు,,రేపటి తరం ప్రగతికి పూనాదులు వేస్తాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యనించారు..భారతదేశాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు ప్రతీ ఒక్కరూ చొరవ తీసుకోవాలని పిలుపిచ్చారు..విక్షిత్ భారత్ సంకల్ప్ యాత్రలో భాగంగా దేశవ్యాప్తంగా ప్రభుత్వ పథకాల లబ్ధిదారులతో ప్రధాని మోదీ వర్చువల్ విధానంలో సంభాషించారు..కుటుంబ వృద్ధితో పాటు ప్రభుత్వ పథకాలు ఏమేరకు ఉపయోగపడ్డాయి అనే విషయం ప్రధాని మోదీ అడిగి తెలుసుకున్నారు..
వికాస్ భారత్ సంకల్ప్ యాత్ర దేశవ్యాప్తంగా ప్రభుత్వ కీలక పథకాలు ప్రతి ఒక్కరి చేయాలన్న లక్ష్యంతో నిర్వహించడం జరుగుతుందన్నారు..ప్రధానితో మాట్లాడిన సందర్భంగా లబ్ధిదారులు తమ అనుభవాలను పంచుకున్నారు.. కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిన పథకాలను చేరుకోలేని దేశంలోని పేద రైతులు, కూలీల కోసం ప్రత్యేకంగా వికాస్ భారత్ సంకల్ప్ యాత్ర ప్రారంభించడం జరిగిందన్నారు..
దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ ఆర్థికంగా స్వాతంభన సాధించాలన్న ప్రధాని మోదీ లక్ష్యం మేరకు వికాస్ భారత్ సంకల్ప్ యాత్ర ప్రారంభమైంది..ఇందులో భాగంగా ఈ యాత్రను మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్, రాజస్థాన్, తెలంగాణ, మిజోరం రాష్ట్రాల్లో జెండా ఊపి ప్రారంభించారు..ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ, గత నెల రోజులుగా ఈ యాత్ర 1500 వందల పట్టణాలకే కాకుండా వేలాది గ్రామీణ ప్రాంతాలకు కూడా వెళ్లిందన్నారు..ఈ సందర్భంగా, ఈ వికాస్ భారత్ సంకల్ప్ యాత్ర ప్రారంభిస్తున్న ఐదు రాష్ట్రాల కొత్త ప్రభుత్వాలకు ఈ పథకం ప్రయోజనాలను ఆయా రాష్ట్రాల ప్రజలకు అందించడానికి ప్రతి వ్యవస్థను బలోపేతం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నామని ప్రధాని అన్నారు..సమాజంలోని ప్రతి వర్గానికి కేంద్ర పథకాల ఫలాలు అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *