రేపటి నుంచి తేజస్ ఎక్స్ప్రెస్ రైలు సేవలు ప్రారంభం- రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్
అమరావతి: భారతదేశంలో ప్రవేశపెట్టిన తేజస్ ఎక్స్ప్రెస్ రైలు తొలి Semi-high speed air conditioned train ఇది,,ఆటో మేటిక్ డోర్లతో కూడిన ఆధునిక ఆన్బోర్డు సౌకర్యాలను కూడా ఉన్నయని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తన ట్విట్టర్ ఖాతాలో తెలిపారు..ఆదివారం (26-02-2023) నుంచి సేవలను అందిస్తుందన్నారు..ఈ రైలులో సీలట్లను అత్యాధునికంగా తీర్చిదిద్దినట్లు వెల్లడించారు..ఫిబ్రవరి 26 నుంచి చెన్నై-మధురై మధ్య నడిచే తేజస్ ఎక్స్ప్రెస్ రైలు తాంబరం స్టేషన్లో ఆగుతుందని దక్షిణ మధ్య రైల్వే డివిజన్ ప్రకటించింది..తేజస్ ఎక్స్ప్రెస్ (ట్రైన్ నం.22671) చెన్నై ఎగ్మోర్ స్టేషన్ నుంచి ప్రతి రోజూ ఉదయం 6 గంటలకు బయలుదేరి,,మధురైకి మధ్యాహ్నం 12.15 గంటలకు చేరుకుంటుంది..తిరుగు ప్రయాణంలో తేజస్ ఎక్స్ప్రెస్ (ట్రైన్ నం.22672) మధురై నుంచి మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరి రాత్రి 9.15 గంటలకు చెన్నై ఎగ్మోర్ రైల్వే స్టేషన్కు చేరుకుంటుంది..