AMARAVATHIDISTRICTS

విజయనగరం జిల్లా వద్ద రెండు రైళ్లు ఢీ-ఆరుగురు మృతి పలువురికి గాయాలు

ఘెర ప్రమాదం..
అమరావతి: విజయనగరం జిల్లా కొత్తవలస మండలం కంటకాపల్లి రైల్వేజంక్షన్ వద్ద రాయగడ ప్యాసింజర్ రైలును వెనుక నుంచి పలాస ప్యాసింజర్ రైలు ఢీకొంది..రాత్రి 7.10 గంటల సమయంలో సిగ్నల్ కోసం ఆగిన ప్యాసింజర్ ను పలాస ప్యాసింజర్ ఢీ కొనడంతో, పట్టాలు తప్పిన విశాఖ-రాయగడ ప్యాసింజర్ 3 బోగీలు చెల్లాచెదురయ్యాయి..ఈ ప్రమాదంలో 6 మంది మృతి చెందినట్లు ప్రాధమిక సమాచారం.. క్షతగాత్రులను చికిత్త నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలిస్తున్నారు.. సంఘటన స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని,,మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని రైల్వే సిబ్బంది వెల్లడించారు.. ప్రమాదం కారణంగా విద్యుత్ వైర్లు తెగిపోవడంతో సహాయక చర్యలకు ఆలస్యం అవుతొంది..
ఈ ప్రమాదానికి సంబంధించి వాల్తేరు డీఆర్ఎం సౌరభ్ ప్రసాద్ మీడియాకు వివరాలు తెలియచేస్తు చీకటి కారణంగా సహాయ చర్యలకు అంతరాయం ఏర్పడుతోందని,,ప్రమాదంపై వివరాలు సేకరిస్తున్నామని తెలిపారు.. ప్రమాదంపై హెల్ప్ లైన్లను రైల్వే అధికారులు ఏర్పాటు చేశారు.. క్షతగాత్రులను విశాఖ, విజయనగరం ఆస్పత్రులకు తరలిస్తున్నట్లు డీఆర్ఎం వెల్లడించారు..ఈ ప్రమాదానికి సంబంధించి అధికారులు హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేశారు.
విశాఖ రైల్వే స్టేషన్ లో హెల్ప్ లైన్స్:-హెల్ప్ లైన్ నెంబర్లు–0891 2746330,,0891 2744619…ఎయిర్ టెల్–
81060 53051,,81060 53052…bsnl-8500041670,,8500041671.. విశాఖపట్టణం K.G.H.లో హెల్ప్ లైన్ నెంబర్లు:-కేజీహెచ్ casuality No.8912558494…2. డాక్టర్ @ కేజీహెచ్ మొబైల్ నెంబర్ 8341483151
3. డాక్టర్ @ కేజీహెచ్ casuality మొబైల్ నెం.8688321986.. బాధితుల వైద్య సాయం కోసం ఈ నెంబర్లకు ఫోన్ చేయాలని జిల్లా కలెక్టర్ మల్లికార్జున విజ్ఞప్తి చేశారు.

ప్రమాదం వివరాలు పూర్తిగా తెలియాల్సి వుంది…

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *