AMARAVATHI

బోనులో చిక్కిన 5వ చిరుత పులి

తిరుమల: తిరుమల కొండపైకి వెళ్లే నడకమార్గంలో నరసింహస్వామి ఆలయం 7వ మైలు మధ్య ప్రాంతంలో చిరుతను అటవీశాఖ అధికారులు బోనులో బంధించారు..రెండు నెలల వ్యవధిలో తిరుమల నడక మార్గంలో నాలుగు చిరుతలను అధికారులు బంధించారు..గురువారం తెల్లవారుజామున 5వ చిరుత అధికారులు ఏర్పాటు చేసిన బోనులో చిక్కుకుంది..నడక మార్గంలో టీటీడీ, అటవీ శాఖ అధికారులు ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశారు..మంగళశారం నాడు ట్రాప్ కెమెరాలో చిరుత సంచారాన్ని గమనించిన అధికారులు దానిని బంధించేందుకు బోనులను ఏర్పాటు చేశారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *