రాజకీయ వారసుడిని ప్రకటించిన బీఎస్పీ అధినేత్రి మాయావతి
అమరావతి: ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి,, బీఎస్పీ అధినేత్రి మాయావతి తన రాజకీయ వారసుడిని ప్రకటించారు.. అదివారం జరిగిన పార్టీ కీలక సమావేశంలో తన మేనల్లుడు ఆకాశ్ ఆనంద్ BSP అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తాడని ఆమె వెల్లడించారు.. మాయావతి తమ్ముడు ఆనంద్ కుమార్ కొడుకు అయిన ఆకాష్ 2019లో మాయావతి లోక్ సభ ఎన్నికల ప్రచారంలో ఆయన అన్ని తనై వ్యవహరించారు..2017 నుంచి రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు..ఆకాష్ ఆనంద్ పార్టీ జాతీయ సమన్వయకర్తగా పనిచేశారు..బిజినెస్ గ్రాడ్యుయేట్ అయిన ఆకాశ్ కి పార్టీలో మంచి పేరుంది.