AMARAVATHINATIONAL

జ్ఞానవాపి కేసులో ముస్లిం సంస్థల పిటిషన్లు కొట్టివేసిన అలహాబాద్ హైకోర్టు

అమరావతి: జ్ఞానవాపి కేసులో ముస్లిం సంస్థలకు అలహాబాద్ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది..జ్ఞానవాపి మసీదు ఉన్న స్థలంలో ఆలయాన్ని పునరుద్ధరించాలని కోరుతూ వారణాసి కోర్టులో పెండింగ్ లో ఉన్న కేసు, విచారణ అర్హత సవాలు చేస్తూ వచ్చిన మొత్తం 5 పిటిషన్ లపై మంగళవారం విచారణ జరిపిన అలహాబాద్ హైకోర్టు, కొట్టివేసింది.. 1991 నాటి ప్రార్థనా స్థలాల (ప్రత్యేక నిబంధనలు) చట్టం ప్రకారం ఆగష్టు 15, 1947కు ముందు మతపరమైన ప్రదేశాల స్వరూపాన్ని ఉనికిలో ఉన్నట్లుగా మార్చడాన్ని పరిమితం చేస్తుందని అంజుమన్ ఇంతేజామియా మసాజిద్ కమిటీ, యూపి సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డ్ వాదనలు వినిపించింది.. హిందువుల దాఖలు చేసిన పిటీషన్లు విచారణకు అనుమతించితగినవే అని అలహాబాద్ హైకోర్టు తీర్పును ఇచ్చింది..వారణసి కోర్టులో వున్న పిటిషన్లు ప్రార్ధనా స్థలాల చట్టం-1991 నిరోధించలేదని స్పష్టం చేశారు..మసీదు స్థానంలో ఆలయంను పునరుద్దరించాలని దాఖలైన పిటీషన్లపై 6 నెలల్లోనే విచారణను పూర్తి చేయాలని వారణాసి కోర్టుకు,, హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది..

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *