ప్రపంచ వేదికపై భారతదేశం విశ్వగురూ-ఇమ్మాన్యూయేల్ మాక్రాన్
అమరావతిం ప్రపంచ వేదికపై భారతదేశం విశ్వగురూ అని,, ప్రపంచానికి పెద్దన్నలాంటిదని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యూయేల్ మాక్రాన్ వ్యాఖ్యనించారు..ప్రధానమంత్రి నరేంద్రమోదీ రెండు రోజుల ఫ్రెంచ్ పర్యటన సందర్భంలో శుక్రవారం ప్రధాని మోదీతో, ఇమ్మాన్యూయేల్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు..అనంతరం మొదటి ప్రపంచ యుద్ధం నాటి ఫొటోలను అందించారు..“ప్రపంచ చరిత్రలో భారత్ ఒక దిగ్గజదేశం.. భవిష్యత్తులో నిర్ణయాత్మక పాత్ర పోషించబోతున్న దేశం..మాకు వ్యూహాత్మక భాగస్వామి, మిత్ర దేశం” అని తను ఇచ్చిన ఫొటోలపై మాక్రాన్ రాశారు..అనంతరం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ “ఈ సంవత్సరం 14వ జూలై పరేడ్,కు భారతదేశాన్ని గౌరవ అతిథిగా స్వాగతించడం మాకు చాలా సంతోషకరం” అన్నారు..ప్రధాని మోదీ ఎదురుపడగానే ఆప్యాయంగా కౌగిళించుకుని స్వాగతం పలికారు..ఇదే సమయంలో భారత నేవీ కోసం ఫ్రాన్స్ నుంచి 26 రాఫెళ్లు విమానలు,, 3 డిజిల్ సబ్ మెరైన్ల కొనుగోలుకు సంబంధించిన ఒప్పందం,ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా ఆవగాహనకు రానున్నట్లు సమాచారం..రెండు రోజుల పర్యటన నిమిత్తం ప్రధానమంత్రి నరేంద్రమోదీ గురువారం ఫ్రాన్స్ చేరుకున్నారు.. ఫ్రాన్స్ రాజధాని ప్యారీస్ లో అడుగుపెట్టిన ప్రధాని నరేంద్రమోదీకి, ఫ్రాన్స్ ప్రధాని ఎలిజబెత్ బార్న్ స్వయం విమానాశ్రయానికి వచ్చి రెడ్ కార్పెట్ స్వాగతం పలికారు..