NATIONAL

ఇన్వెస్టర్ల భద్రత కోసం కమిటీ  వేసేందుకు కేంద్రానికి ఎలాంటి అభ్యంతరం లేదు-సొలిసిటర్ జనరల్

అమరావతి: అదానీ-హిండెన్‌బర్గ్‌(షార్ట్ సెల్లింగ్ కంపెనీ) వ్యవహారంపై కమిటీ వేసేందుకు కేంద్రం అమెదం తెలిపింది.. అదానీ కంపెనీల వివాదంపై సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపిస్తూ, ఇన్వెస్టర్ల భద్రత కోసం కమిటీ  వేసేందుకు కేంద్రానికి ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు..ఈ వ్యవహారాన్ని సెబీ పర్యవేక్షిస్తోందని,, సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ ధర్మాసనానికి తెలిపారు..కేంద్రం వివరణపై స్పందించిన న్యాయమూర్తి బుధవారంలోగా  కమిటీ సబ్యుల పేర్లను కోర్టుకు సమర్పించాలని సొలిసిటర్ జనరల్ కు ఆదేశించింది..కేసు తదుపరి విచారణను ఫిబ్రవరి 17వ తేదికి వాయిదా వేసింది..అదానీ గ్రూప్ స్టాక్ మానిప్యులేషన్,, అకౌంటింగ్ ఫ్రాడ్ కు పాల్పడిందని (షార్ట్ సెల్లింగ్ కంపెనీ) హిండెన్ బర్గ్ ఆరోపించింది..ఈ క్రమంలో సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో కమిటీ వేసేలా కేంద్రాన్ని ఆదేశించాలంటూ సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్లు దాఖలయ్యాయి..

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *