AMARAVATHINATIONAL

ఆసుపత్రులు,విద్యాసంస్థల్లో UPI చెల్లింపు పరిధిని పెంచిన ఆర్బీఐ

అమరావతి: దేశంలో UPI లావాదేవీలను ప్రోత్సహించేందుకు (RBI) రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మానిటరీ పాలసీ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకుంది..UPI చెల్లింపుల్లో ప్రపంచంలోనే భారత్ మొదటి స్థానంలో ఉన్నట్లు ఆర్బీఐ తెలిపింది..UPI చెల్లింపు ప్రక్రియను చాలా సులభతరం చేసింది..అయితే ఆస్పత్రుల్లో బిల్లు చెల్లింపులకు లక్ష రూపాయల వరకు పరిమితి ఉండటంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి..దీంతో పరిమితిని పెంచుతూ, ప్రస్తుతం రూ.లక్ష నుంచి రూ.5 వరకు కూడా UPI చెల్లింపులకు అవకాశం కల్పించారు..అంతే కాకుండా ఆసుపత్రులతో పాటు పాఠశాలలు, కళాశాలల్లో యూపీఐ లావాదేవీల పరిమితిని రూ.5 లక్షలకు పెంచారు.. ఈ నేపధ్యంలో రెపో రేటులో ఎలాంటి మార్పు చేయడం లేదని RBI గవర్నర్ శక్తికాంత దాస్ శుక్రవారం ఎంపీసీ ప్రకటనలో తెలిపారు..

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *