AMARAVATHIHYDERABAD

తెలంగాణలో ముందస్తు ఎన్నికలు ఉండవు-ముఖ్యమంత్రి కేసీఆర్

హైదరాబాద్: తెలంగాణలో ముందస్తు ఎన్నికలు ఉండవని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు..శుక్రవారం ప్రగతిభవన్ లో బీఆర్‎ఎస్ పార్టీ విస్తృత‎స్థాయి సమావేశం జరిగింది,,ఈ సమావేశంలో కేసీఆర్, పార్టీ నేతలకు కీలక సూచనలు చేశారు..ఈ సందర్భంగా సీ.ఎం మాట్లాడుతూ తెలంగాణలో  షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని చెప్పారు.. బీజేపీ సభలకు కౌంటర్ సభలు నిర్వహించాలని,, బీజేపీ చేస్తున్న విమర్శలను తిప్పికొట్టాలన్నారు..ఎన్నికల వరకు ప్రజల్లోనే ఉండాలని, పాదయాత్రలు చేసి వారి సమస్యలు తెలుసుకోవాలని కేసీఆర్ సూచించారు..నియోజక వర్గాల వారీగా పర్యటించాలని,,వీలైనంత వరకు ప్రజాక్షేత్రంలోనే ఉండాలని అదేశించారు.. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని అన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *