తిరుపతి IIT క్యాంపస్ పనులు జూన్ 30 నాటికి పూర్తి చేస్తాం-కేంద్ర మంత్రి సుభాస్ సర్కార్
అమరావతి: తిరుపతిలోని IIT క్యాంపస్ పనులు తొందరలోనే పూర్తి చేసి ఈ ఏడాది జూన్ 30 నాటికి అప్పగిస్తామని కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి డాక్టర్ సుభాస్ సర్కార్ వెల్లడించారు..బుధవారం రాజ్యసభలో ysrcp M.P విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ తిరుపతి ఐఐటి క్యాంపస్లో నిర్మాణ పనులు ఏప్రిల్ నెల చివరి నాటికి పూర్తి కావలసి ఉందని,,కొన్ని కారణల వల్ల జూన్ చివరికి పూర్తి చేస్తామన్నారు.. 2023-24 ఆర్థిక సంవత్సరానికి దేశంలోని IITలు అన్నింటికి కలిపి 9361 కోట్ల రూపాయలను కేటాయించినట్లు ఆయన పేర్కొన్నారు..ఈ ఆర్థిక సంవత్సరంలో తమకు 407 కోట్ల రూపాయలు కేటాయించవలసిందిగా తిరుపతి ఐఐటి యాజమాన్యం కోరిందన్నారు.. అయితే తిరుపతి ఐఐటీకి ఎంత మొత్తం కేటాయించాలన్న అంశం ఇంకా మంత్రిత్వ శాఖ పరిశీలనలోనే ఉన్నట్లు ఆయన తెలిపారు.. IITలకు కేటాయించిన 9361 కోట్ల రూపాయల నుంచే సిబ్బంది జీతభత్యాలు, పెన్షన్లు, స్కాలర్షిప్లు, కాంట్రాక్ట్ సిబ్బందికి వేతనాలు, చిన్న చిన్న పరికరాలు, లైబ్రరీ పుస్తకాలు, వడ్డీ చెల్లింపులు వంటి వాటి చెల్లింపుల కోసం ఉద్దేశించినవని మంత్రి చెప్పారు.