AMARAVATHIDEVOTIONAL

ప్రారంభంమైన అమరనాథ్ యాత్ర,అగష్టు 31 వరకు కొనసాగింపు

అమరావతి: మంచు శివలింగాన్ని దర్శించుకునేందుకు దక్షిణ కశ్మీర్ హిమాలయాల్లో సాగే అమరనాథ్ యాత్ర నేడు (జూలై 1వ తేదిన) లాంఛనంగా ప్రారంభమైంది..జమ్మూలోని భాగవతి నగర్ క్యాంపు నుంచి తొలి బృందం యాత్రను జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా జెండా ఊపి ప్రారంభించారు.. ఆగస్టు 31వ తేదీ వరకూ ఈ యాత్ర కొనసాగనుంది..యాత్రకు సంబంధించి ఎలాంటి దుర్ఘటనలో అవకాశం లేకుండా అధికారులు, ఐటీబీపీ దళాలతో భారీ భద్రత కల్పిస్తున్నారు…దక్షిణ కశ్మీర్లోని హిమాలయాల్లో 3880 మీటర్ల ఎత్తున ఉన్న అమర్నాథ్ పుణ్యక్షేత్రం దర్శనంలో భాగంగా భక్తులు మంచుతో కూడిన శివలింగాన్ని దర్శించుకోనున్నారు.. 62 రోజుల పాటు సాగే ఈ యాత్రలో పాల్గొనేందుకు ఇప్పటికే పేర్లు నమోదు చేసుకున్న భక్తులకు రెండు మార్గాల ద్వారా అమర్నాథ్ గుహకు చేరుకోనున్నారు..మొదటి మార్గంలో వెళ్లేవారు షెహల్గావ్ నుంచి పంచతరుణికి వెళ్లి,, అక్కడ నుంచి అమర్నాథ్ గుహకు చేరుకుంటారు.. రెండో మార్గంలో వెళ్లే వారు శ్రీనగర్ నుంచి బాల్తాల్ కు వెళ్లి అక్కడ నుంచి సుమారు 14 కి.మీ పయనించి మంచు లింగాన్ని దర్శించుకుంటారు..ఈ సంవత్సరం దాదాపు 3 లక్షల మంది పైగా భక్తులు అమర్నాథ్ యాత్రకు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *