పాక్ ప్రధానిగా నవాజ్ షరీఫ్ తమ్ముడు షెహబాజ్ షరీఫ్
అమరావతి: పాకిస్థాన్లో తాజాగా ముగిసిన జాతీయ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాకపోవడంతో అయోమయ పరిస్థితి నెలకొన్నది..ఈ నేపథ్యంలో మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్కు చెందిన PML-N పార్టీ కీలక నిర్ణయం తీసుకున్నది.. కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు 6 పార్టీలు అంగీకరానికి రావడంతో, ప్రధాని అభ్యర్థిగా షెహబాజ్ షరీఫ్ను నియమిస్తూ PML-N పార్టీ అధినేత నవాజ్ షరీఫ్ నిర్ణయం తీసుకున్నారు.. మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ తమ్ముడే షెహబాజ్ షరీఫ్..పాక్ అధ్యక్షుడిగా జర్దారి బాధ్యతలు చేపట్టే అవకాశాలు ఉన్నాయి. పాకిస్తాన్ లోని పంజాబ్ రాష్ట్రంలో నవాజ్ షరీప్ కూతురు మరియం నవాజ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు..పార్టీ గుర్తు లేకపోయినప్పటికి అత్యధిక సీట్లు గెలిచిన ఇమ్రాన్ పార్టీ(PTI) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయింది..పార్లమెంట్ ఎన్నికల్లో ఇమ్రాన్ మద్దతుదారులు 92 స్థానాల్లో గెలవగా,, PML-N పార్టీ 79,, PPP 54 సీట్లను గెలుచుకున్నది.