వైసీపీ మచీలిపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి పార్టీకి,ఎంపీ పదవికి రాజీనామా
జనసేనలో చేరుతున్నాను...
అమరావతి: అధికారపార్టీ YSRCPకి,,మచీలిపట్నం ఎంపీ పదవికి వల్లభనేని బాలశౌరి శనివారం రాజీనామా చేశారు.. ఆయన జనసేన పార్టీ కండువా కప్పుకోనునారు..గత లోక్ సభ ఎన్నికల్లో మచిలీపట్నం నుంచి వైసీపీ తరఫున వల్లభనేని బాలశౌరి పోటీ చేసి గెలిచారు..ప్రస్తుతం మచిలీపట్నం స్థానంలో ఇతర నేతను బరిలోకి దింపాలని వైసీపీ భావిస్తోంది..తనకు సీటు దక్కదని తేలడంతో బాలశౌరి పార్టీ మారాలని నిర్ణయించుకున్నారు..ఈ మేరకు అయన తన మద్దతుదారులతో చర్చించినట్లు తెలుస్తోంది..ఆయన టీడీపీలో చేరతారని కూడా ప్రచారం జరిగింది..అయితే జనసేనలో చేరుతున్నట్లు ప్రకటించారు..బాలశౌరి కొంత కాలంగా నియోజకవర్గానికి, వైసీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు..ఎమ్మేల్యే పేర్ని.నానితో అయనకు విభేధలు వున్నాయని సమాచారం..ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికారపార్టీ అసంతృప్త నేతలు ఇతర పార్టీల వైపునకు చూస్తున్నారు.