AMARAVATHICRIME

గుగూల్ మ్యాప్ ను గుడ్డిగా అనుసరించి ఇద్దరు డాక్టరు మృతి

అమరావతి: గుగూల్ మ్యాప్ ను గుడ్డిగా అనుసరించి కారును డ్రైవ్ చేయడంతో కేరళలోని పెరియార్ నదిలో కారు పడి పోవడంతో ఇద్దరు వైద్యులు మృతి చెందారు,, కేరళలోని ఎర్నాకులం జిల్లాలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో అద్వైత్, అజ్మల్ లు డాక్టర్లుగా పని చేస్తున్నారు..ఆదివారం రాత్రి ఒక బర్తేడే పార్టీకి హాజరైన అద్వైత్ (29), అజ్మల్ (29)లు మరో ముగ్గురు స్నేహితులతో కలసి అర్ధరాత్రి 12.30 గంటల ప్రాంతంలో వారు కారులో కొడంగల్లూర్ కు తిరిగి వస్తున్నారు..భారీ వర్షం కారణంగా రోడ్డు స్పష్టంగా కన్పించక పోవడంతో,,డైరెక్షన్స్ కోసం గూగుల్ మ్యాప్స్ ను అనుసరించారు..గూగుల్ మ్యాప్స్,,,,సదరు రోడ్డును గొతురుత్ వద్ద నేరుగా నదిలోకి చూపించింది..అది గమనించని వీరు,,రోడ్డుపై నీరు పారుతూన్నట్లుగా భావించి,,దాటేందుకు ప్రయత్నించడంతో కారు పెరియార్ నదిలో పడిపోవడిపోయింది..ఇది గమనించిన స్థానికలు వెంటనే అక్కడికి చేరుకుని వారిని రక్షించేందుకు ప్రయత్నించగా,,అప్పటికే ఇద్దరు యువ వైద్యులు మరణించారు..వెంటనే అగ్నిమాపక,,పోలీసు సిబ్బందికి సమాచారం అందించారు..కారులో ప్రయాణిస్తున్న మరో ముగ్గురు గాయాలు కావడంతో,,చికిత్స కోసం వారిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించమని,,చనిపోయిన ఇద్దరు వైద్యుల మృతదేహాలను వెలికితీసేందుకు స్కూబా డైవింగ్ బృందాన్ని రంగంలోకి దింపినట్లు వడక్కేకర పోలీస్ స్టేషన్ అధికారి తెలిపారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *