కుప్వారా జిల్లాలో ఇద్దరు టెర్రరిస్టులు ఎన్ కౌంటర్
అమరావతి: జమ్మూ కశ్మీర్ లోని కుప్వారా జిల్లాలో పరిధిలోని నియంత్రణ రేఖ వెంట దేశంలోనికి చొరబడటానికి ప్రయత్నించిన ఇద్దరు ఉగ్రవాదులు భద్రతా బలగాల చేతిలో హతమయ్యారని పోలీసులు తెలిపారు..కుపార్వాజిల్లా పోలీసులు తెలిపిన వివరాల ఇలా వున్నాయి..ఉత్తర కశ్మీర్ జిల్లాలోని మచిల్ సెక్టార్ లోని కుంకడి ప్రాంతంలో చొరబాటు ప్రయత్నం జరగబోతున్నట్లు “కుప్వారా పోలీసులు అందించిన ఇంటెలిజెన్స్ సమాచారం ఆధారంగా, మచల్ సెక్టార్ లోని కుంకడి ప్రాంతంలో ఆర్మీ, పోలీసులు జరిపిన జాయింట్ ఆపరేషన్ చేపట్టారు..భద్రతా బలగాలపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు..దింతో భద్రతా బలగాలు కూడా కాల్పులు జరిపారు..అనంతరం ఉగ్రవాదుల వైపు నుంచి కాల్పులు అగిపోవడంతో ,,అక్కడి వెళ్లి పరిశీలించిన ఆర్మీకి,,రెండు AK రైఫిళ్లు, నాలుగు AK మ్యాగజైన్లు, పిస్టల్, పాకిస్తానీ నగదును స్వాధీనపరచుకున్నారు.