AMARAVATHI

ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్‌

అమరావతి: ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్‌ అవతరించింది..చైనాను జనాభాను దాటి భారత్‌లో  ప్రస్తుతం 29 లక్షల మంది ప్రజలు అధికంగా ఉన్నారని ఐక్యరాజ్యసమితి గణాంకాలు స్పష్టం చేశాయి..స్టేట్‌ ఆఫ్‌ వరల్డ్‌ పాపులేషన్‌ రిపోర్ట్‌ 2023 పేరుతో ఐక్యరాజ్యసమితి పాపులేషన్‌ ఫండ్‌ నివేదికను విడుదల చేసింది..నివేదిక ప్రకారం భారత్‌లో 142.86 కోట్ల మంది జనాభా ఉన్నారని అందులో పొందుపర్చింది..చైనా జనాభా 142.57 కోట్ల మంది ఉండగా,,340 మిలియన్లతో అమెరికా 3వ స్థానంలో ఉందని వెల్లడించింది..ఎప్పుడు చైనా జనాభాను భారత్‌ ఎప్పుడు అధిగమించిందనే విషయాన్ని స్పష్టం చేయలేదు..2023 ఫిబ్రవరి నాటికి అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం ఈ నివేదికను రూపొందించినట్లు సమాచారం..ప్రపంచ జనాభాలో (804.5 కోట్లు) మూడింటా ఒక వంతు ఈ రెండు దేశాల్లోనే ఉన్నరని పేర్కొన్నది..చైనా జనాభా సంవత్సరం ఉచ్చస్థితికి చేరిందని,, అప్పటి నుంచి తగ్గుతూ వచ్చిందని తెలిపింది..ఇండియా జనాభా మాత్రం క్రమేపి పెరుగుతోందని వెల్లడించింది..భారతదేశ జనాభాలో 0 నుంచి 14 ఏండ్ల మధ్య వయస్సు ఉన్న వారు 25 శాతం ఉన్నారని,,10 నుంచి 19 ఏళ్ల మధ్య వయస్కులు 18 శాతం,,10 నుంచి 24 సంవత్సరాల మధ్య వయస్కులు 26 శాతం ఉన్నారని డేటాలో పేర్కొంది.. భారత్ లో 15 నుంచి 64 సంవత్సరాల మధ్య వయసు ఉన్న వారు 68 శాతం మంది ఉన్నారని,,65 సంవత్సరాలకు పైబడిన వారు దేశ జనాభాలో 7 శాతంగా ఉన్నారని పేర్కొన్నది.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *