AMARAVATHINATIONAL

ఆధార్‌ ఉచిత అప్‌డేట్‌కు మరో మూడు నెలలు గడువు పెంపు

అమరావతి: భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ ఆన్‌లైన్‌లో ఉచితంగా ఆధార్‌ వివరాలు అప్‌డేట్‌ చేసకునేందుకు కల్పించిన గడువు మార్చి 14తో ముగియనున్ననేపధ్యంలో ఆధార్‌ ఉచిత అప్‌డేట్‌కు మరో మూడు నెలలు గడువు ఇస్తున్నట్టు ఉడాయ్ వెల్లడించింది..ఆధార్‌ అప్‌డేట్‌ కోసం ప్రజల నుంచి విశేష స్పందన వస్తుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉడాయ్‌ ఓ ప్రకటనలో పేర్కొంది..ఈ ఉచిత సేవలు https://myaadhaar.uidai.gov.in/portal పోర్టల్‌ ద్వారా మాత్రమే అందుబాటులో ఉంటాయని తెలిపింది..

ఇష్టారాజ్యంగా వసూలు చేస్తే:- ఆధార్‌ సెంటర్లలో కార్డుల అప్ డెట్ కోసం ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో మీ సేవ కేంద్రాల్లో రుసుం వసూలుపై స్పష్టమైన నిబంధనలు విధించారు.. బయోమెట్రిక్‌ అప్‌డేట్‌ కోసం రూ.100, డెమోగ్రాఫిక్‌ అప్‌డేట్‌కు రూ.50, ఆధార్‌ డౌన్‌ లోడ్‌,, కలర్‌ ప్రింట్‌కు రూ.30 చెల్లించాలి..అందులో సెంటర్ల నిర్వాహకులు తిరకాసు పెట్టినా,, అదనంగా డబ్బులు వసూలు చేసినా,, సంబంధిత ఆధార్‌ సెంటర్‌ కోడ్‌ నెంబర్‌తో టోల్‌ ఫ్రీ 1947 నంబర్‌కు ఫిర్యాదు చేయవచ్చు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *