ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ నీతూ ఘంఘూస్
అమరావతి: ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ విజేతగా భారత్ కు చెందిన నీతూ ఘంఘూస్ నిలిచింది..శనివారం ఢిల్లీలో జరుగుతున్న ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ పోటీల్లో భారత్ నుంచి 48 కేజీల విభాగంలో మంగోలియాకు చెందిన లుత్సాయిఖాన్ అల్టాంట్సెట్సెగ్ను 5-0 తేడాతో ఓడించి స్వర్ణం పతకం కైవశం చేసుకుంది.. ఫైనల్ మ్యాచ్ లో నీతూ మొదటినుంచి ప్రత్యర్థిపై పంచులతో విరుచుక పడి పూర్తి ఆధిపత్యం సాధించింది..నీతూ గోల్డ్ మెడల్ సాధించటంపై దేశవ్యాప్తంగా అభినందనలు వెల్లెవెత్తున్నాయి..నీతూ ప్రపంచ ఛాంపియన్గా నిలిచిన ఆరో భారతీయ బాక్సర్గా చరిత్రకు ఎక్కింది..