దేశంలోనే అతిపొడవైన కేబుల్ బ్రిడ్జ్ని ప్రారంభించిన ప్రధాని మోదీ
అమరావతి: గుజరాత్లోని ద్వారకలో వద్ద దేశంలోనే అతిపొడవైన కేబుల్ బ్రిడ్జ్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదివారం ఉదయం ప్రారంభించారు.. రూ.979 కోట్ల వ్యయంతో 27.20 మీటర్ల వెడల్పు,, 2.3 కిలోమీటర్ల పొడవున్న ఈ వంతెనకు “సుదర్శన్ సేతు” అని పేరు పెట్టారు..ఈ బ్రిడ్జి ఓఖా ప్రాంతాన్ని బెట్ ద్వారకతో అనుసంధానిస్తుంది..ఈ వంతెన నిర్మాణానికి 2017 అక్టోబర్లో ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు..నాలుగు లేన్లతో నిర్మించిన ఈ వంతెన పైన ఇరువైపులా 2.5 మీటర్ల వెడల్పైన ఫుట్పాత్లు ఏర్పాటు చేశారు.. సుదర్శన్ సేతును ఒక ప్రత్యేకమైన డిజైన్తో నిర్మించారు..ఫుట్పాత్ పై భాగంలో సొలార్ ప్యానల్స్ అమర్చారు.. ఈ సోలార్ ప్యానెల్స్ 1 మెగావాట్ల విద్యుత్ను ఉత్పత్తి చేస్తాయి.. బ్రిడ్జ్ ఇరువైపులా భగవద్గీత శ్లోకాలు,, శ్రీకృష్ణుడి చిత్రాలు ఉంచారు.. ప్రధాని మోదీ నేడు పలు ప్రారంభోత్సవాల్లో పాల్గొననున్నారు.. మధ్యాహ్నం ఆయన రాజ్కోట్లోని (గుజరాత్) తొలి ఎయిమ్స్ ఆసుపత్రికి ప్రారంభిస్తారు..అక్కడి నుంచే వర్చువల్ పద్దతిలో ఆంధ్రప్రదేశ్,,పంజాబ్,, ఉత్తర్ప్రదేశ్,, పశ్చిమబెంగాల్లో ఎయిమ్స్ ఆసుపత్రులను ప్రారంభిస్తారు..