ఆమ్ ఆద్మీ పార్టీకి కోలుకొలేని ఎదురుదెబ్బ-మంత్రి ఆనంద్ రాజీనామ
అమరావతి: ఆమ్ ఆద్మీ పార్టీకి కోలుకొలేని ఎదురుదెబ్బ తగిలింది.. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ప్రభుత్వంలో సాంఘిక సంక్షేమశాఖ మంత్రిగా పని చేస్తున్న రాజ్ కుమార్ ఆనంద్ బుధవారం తన పదవికి ఆమ్ ఆద్మీ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి సైతం రాజీనామా చేశారు..2020 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పటేల్నగర్ స్థానం నుంచి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిపై 30 వేల ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు..నవంబర్ 2022లో ఢిల్లీ కేబినెట్ లేబర్ ఎంప్లాయిమెంట్,, కో ఆపరేటివ్ మంత్రితో పాటు పలు శాఖల బాధ్యతలు నిర్వర్తించారు..ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు సేవ చేసేందుకు ఆమ్ ఆద్మీ పార్టీలో చేరానని అయితే పార్టీ అవినీతిలో కూరుకుపోయిందని,,దింతో ఇకపై పార్టీతో కలిసి పని చేయలేనని స్పష్టం చేశారు.