బాపట్ల సమీపంలో తీరాన్నిదాటిన మిచౌంగ్ తుఫాన్
అమరావతి: మిచౌంగ్ తుఫాన్ తీరం దాటింది..నెల్లూరుజిల్లాను అతలాకుతలం చేసిన మిచౌంగ్ తుఫాన్,, బాపట్ల సమీపంలో తీరాన్ని దాటిన తర్వాత బలహీనపడి వాయుగుండంగా మారనుంది. బాపట్ల తీరాన్ని మిచౌంగ్ తుఫాన్ తాకిన సమయంలో 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి..గాలుల తీవ్రతకు చెట్లు కూలిపోయాయి..విద్యుత్ స్తంభాలు ఒరిగిపోయాయి.. తీర ప్రాంతం అల్లకల్లోలంగా మారింది..తీర ప్రాంతంలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురుస్తుండగా,, సముద్రంలో అలలు.. ఐదు నుండి ఆరు అడుగుల మేర ఎగసిపడుతున్నాయి.