AMARAVATHITECHNOLOGY

ఏ.ఐ సాయంతో ఇండియాలో ఎన్నికలను చైనా ప్రభావితం చేసేందుకు కుట్రలు-మైక్రోసాఫ్ట్‌

అమరావతి: భారతదేశంలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో చైనా జోక్యం చేసుకునే అవకాశాలు ఉన్నట్లు మైక్రోసాఫ్ట్‌ హెచ్చరించింది.. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌(AI) ద్వారా లోక్‌సభఎన్నికలపై డ్రాగన్‌ ప్రభుత్వం ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు మైక్రోసాఫ్ట్‌ ఒక రిపోర్టును విడుదల చేసింది.. ఇప్పటికే ఇండియా ఎలక్షన్ ప్రచారం వేడి రోజు రోజుకు పెరుగుతొంది..సార్వత్రిక సమరంలో పార్టీలు ఒకవైపు ప్రచారాలు, బహిరంగ సభలతో హోరెత్తిస్తూనే మరోవైపు సోషల్ మీడియా క్యాంపెయిన్ ను జోరుగానే చేస్తున్నాయి..ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌తో రూపొందించిన కంటెంట్‌ను ఉపయోగించి భారత్,, దక్షిణ కొరియా,,అమెరికాలో జరగనున్న ఎన్నికల ప్రభావితం చేసేందుకు చైనా సిద్ధమవుతోందని మైక్రోసాఫ్ట్ సిద్దమౌవుతొందని వెల్లడించింది.. ఈ ఎన్నికల సమయంలో తమ ప్రయోజనాలకు అనుకూలంగా మార్చుకునేందుకు సామాజిక మాధ్యమాల ద్వారా AI ఆధారిత కంటెంట్‌ను చైనా ప్రచారం చేసే అవకాశం ఉన్నట్లు తెలిపింది..మీమ్స్‌,, వీడియోలు,, ఆడియో రూపంలో ప్రచారం చేయవచ్చని మైక్రోసాఫ్ట్‌ ఆందోళన వ్యక్తం చేసింది.. డీప్‌ఫేక్‌ సాంకేతికతను కూడా ఉపయోగించి చైనా తమకు అనుకూలంగా ఎన్నికల ప్రచారాన్ని మార్చుకునే అవకాశం ఉందని హెచ్చరించింది..ఇలాంటి కుయుక్తులు సార్వత్రిక ఎన్నికల్లో తక్కువ ప్రభావం చూపుతుందని రిపోర్టులో పేర్కొంది..

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *