లెజెండరీ క్రికెటర్ బిషన్ సింగ్ బేడీ కన్నుమూత
అమరావతి: మాజీ ఆటగాడు,, లెజెండరీ క్రికెటర్ బిషన్ సింగ్ బేడీ (77) అనారోగ్యంతో సోమవారం మరణించాడు.. 1946, సెప్టెంబర్ 25న అమృత్ సర్ లో జన్మించిన ఆయన,,21 సంవత్సరాల వయస్సులోనే జాతీయ క్రికెట్ జట్టులోకి ప్రవేశించాడు..1979లో తొలి టెస్టు ఆడే అవకాశం దక్కింది..కొద్దికాలంలోనే దిగ్గజ స్పిన్నర్ గా ఎదిగి టీమిండియాకు ప్రధాన బౌలర్ గా మారాడు.. మొత్తంగా 67 టెస్టులు ఆడి 266 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు..10 వన్డేలు ఆడి 7 వికెట్లు తీసుకున్నాడు.. 1975, 1979 క్రికెట్ వన్డే ప్రపంచకప్ లలో టీమిండియాలో చోటు పొందాడు..ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో 370 మ్యాచ్ లు ఆడి 1,560 వికెట్లు పడగొట్టారు.తన ఇంటర్నేషనల్ కెరీర్ లో 22 టెస్ట్ మ్యాచ్ లకు కెప్టెన్ గానూ వ్యవహరించిన బిషన్ సింగ్ బేడీ, ఎంతోమంది యువ క్రికెటర్లను తీర్చిదిద్దాడు..