బీరు తయారు ట్యాంకులో మూత్ర విసర్జన చేసిన కంపెనీ ఉద్యోగి
అమరావతి: చైనా దేశంలోని అగ్రశ్రేణి బీరు తయారీ పరిశ్రమ సింగ్ టావో “ రా మెటిరియల్ ” స్టాక్ చేసే ట్యాంకులో సదరు కంపెనీ ఉద్యోగి మూత్ర విసర్జన చేసిన వీడియో వెలుగుచూసింది..దింతో సింగ్టావో కంపెనీ దర్యాప్తు ప్రారంభించింది..వీడియో తీసిన వ్యక్తి, అందులో కనిపిస్తున్న వ్యక్తి ఇద్దరూ కంపెనీ ఉద్యోగులేనని వెల్లడైంది.. క్లిప్, హెల్మెట్, యూనిఫాం ధరించిన ఒక వ్యక్తి ఎత్తైన గోడపైకి ఎక్కి కంటైనర్ లోకి మూత్ర విసర్జన చేసినట్లు చైనీస్ సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్ వీబోలో బయటపడింది.. సింగ్ టావో బ్రూవరీ గోదాములో ఈ సంఘటన చోటు చేసుకుంది.. ఈ వీడియో ఫుటేజ్ ఆన్ లైన్ లో మిలియన్ల మంది వీక్షించారు..దీంతో కంపెనీ వెంటనే పోలీసులను అప్రమత్తం చేసి,, మూత్రం పోసిన బీరు బ్యాచ్ పదార్థాలను సీజ్ చేసింది..ఈ సంఘటనపై పోలీసులను సంప్రదించామని, దర్యాప్తు కొనసాగుతోందని కంపెనీ తెలిపింది..ఈ సంఘటనతో సింగ్ టావో స్టాక్ మార్కెట్ లో షేరు ధర పతనమైంది.. సోమవారం ఉదయం షాంఘై స్టాక్ ఎక్స్ఛేంజ్ ప్రారంభమైనప్పుడు కంపెనీ షేర్లు దారుణంగా పడిపోయాయి..