AMARAVATHINATIONAL

బైజూస్ సంస్థ కార్యాలయాలపై ఈడీ అధికారులు దాడులు

అమరావతి: ప్రముఖ్య ఆన్ లైన్ ఎడ్యూకేట్ సంస్థ అయిన బైజూస్ సిఈఓ రవీంద్రన్ బైజూస్ నివాసం,,సంస్థల్లో శనివారం తమిళనాడు,, బెంగుళూరుల్లో సోదాలు నిర్వహించినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు తెలిపారు..2011-2023 మధ్య కాలంలో బైజూస్ కు దాదాపు రూ.28 వేల కోట్లు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చాయిని తెలిపింది..అదే సమయంలో రూ.9,754 కోట్లను వివిధ విదేశీ అధికారులకు బైజూస్ బదలీ చేసినట్లు పేర్కొన్నారు.ఇందులో పలు అవకతవకలు జరిగాయని,ఫెమా చట్టాన్ని ఉల్లఘించి నిధులు స్వీకరించినట్లు ఫిర్యాదులు అందాయని అధికారులు వెల్లడించారు.2020-21 అర్ధిక సంవత్సరం నుంచి బైజూస్ కంపెనీ ఆర్దిక లావాదేవీలను వెల్లడించలేదని,,ఖాతాలను ఆడిటింగ్ చేయించలేదని పేర్కొన్నారు..పలు సార్లు రవీంద్రన్ కు సమన్లు జారీ చేశామని,, కానీ అయన ఈడీ ముందు హాజరు కాలేదన్నారు..ఈడీ నిర్వహించిన సోదాల్లో పలు కీల ప్రతాలతో పాటు డిజిటల్ డేటాను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *