AMARAVATHIDEVOTIONAL

తిరుమల శ్రీ వారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న ఆం.ప్ర రాష్ట్ర గవర్నర్

తిరుమల: శనివారం ఉదయం తిరుమల శ్రీ పద్మావతి అతిథి గృహం నుంచి కుటుంబ సమేతంగా బయలుదేరి  శ్రీవారి ఆలయం చేరుకున్నఆం.ప్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ కి TTD EO ధర్మారెడ్డి స్వాగతం పలకగా,తొలుత గవర్నర్ వరాహ స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం శ్రీవారి ఆలయం చేరుకున్న వీరికి వేదపండితులు ఇస్తేకఫాల్ స్వాగతం పలికారు. ధ్వజస్తంభం వద్ద మొక్కులు తీర్చుకుని శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం రంగనాయక మండపం వద్ద వేద పండితులు వేద మంత్రాలతో గవర్నర్ కి ఆశీర్వచనం పలికి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా టీటీడీ ఈవో గవర్నర్ కి వెంకటేశ్వర స్వామి వారి చిత్ర పటాన్ని అందచేశారు. అనంతరం గవర్నర్ రేణిగుంట విమానాశ్రయంకు బయలుదేరి అమరావతికి తిరుగు ప్రయాణమయ్యారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్, తిరుపతి ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి, టీటీడీ సివిఎస్ఓ నరసింహ కిషోర్ తదితరులు ఉన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *