మంగళవారం నాటికి నెల్లూరు-మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశం
అమరావతి: నైరుతి బంగాళాఖాతంలో తీవ్రవాయుగుండంగా బలపడిన వాయుగుండం ఆదివారం నాటికి తుఫానుగా మారే అవకాశం ఉందని వాతావరణశాఖాధికారులు తెలిపారు..అటు తర్వాత దక్షిణకోస్తా తీరానికి సమాంతరంగా పయనించనున్న తుఫాన్ మంగళవారం మధ్యాహ్ననం నెల్లూరు-మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశం వుందని పేర్కొన్నారు. దీని ప్రభావంతో ఆదివారం నుంMR మంగళవారం వరకు రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు,, అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయన్నారు.. మంగళవారం అక్కడక్కడ అతి తీవ్రభారీ వర్షాలు నమోదైయ్యే అవకాశం వుందన్నారు..ఆదివారం నుంచి కోస్తా తీరం వెంబడి గంటకు 80 -100 కీమీ వేగంతో బలమైన గాలులు వీస్తాయని వెల్లడించారు.