AMARAVATHINATIONAL

ఆ రెండు దేశాల్లోకి తదుపరి ప్రకటన వచ్చేంతవరకు వెళ్లదు-విదేశాంగ శాఖ

అమరావతి: ప్రభుత్వం నుంచి తదుపరి ప్రకటన వచ్చేంతవరకు భారతీయ పౌరులెవరూ ఇరాన్,, ఇజ్రాయెల్ దేశాలకు వెళ్లొద్దని కేంద్ర విదేశాంగశాఖ శుక్రవారం అడ్వైజరీ జారీ చేసింది..సదురు దేశాల్లో నెలకొన్న పరిస్థితులు దృష్ట్యా ఈ రెండు దేశాలకు ప్రయాణాన్ని విరమించుకోవాలని సూచించింది.. ఇప్పటికే ఇరాన్,, ఇజ్రాయెల్‌ దేశాల్లో ఉన్న భారతీయులు అక్కడి భారత రాయబార కార్యాలయాలను సంప్రదించి పేర్లను నమోదు చేసుకోవాలని కోరింది.. ఇరాన్,, ఇజ్రాయెల్ దేశాల్లోని భారత పౌరులు తమ భద్రతకు అధిక ప్రాధాన్యతమివ్వాలని,, భద్రంగా ఉన్నామో లేదో గమనించుకోవాలని అడ్వైజరీ పేర్కొంది.. వారి బయట ప్రధేశాల్లో తిరగడం వీలైనంత మేర తగ్గించుకోవాలని తెలిపింది..ఈ సమాచారాన్ని భారత విదేశాంగ శాఖ అధికారిక ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ‘ఎక్స్’ వేదికగా పేర్కొన్నారు..ఇరాన్,, ఇజ్రాయెల్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో కేంద్రం ఈ ప్రకటన జారీ చేసింది..ఇటీవల సిరియాలోని ఇరాన్ రాయబార కార్యాలయంలో జరిగినలో బాంబు దాడిలో 13 మంది ఇరాన్ కు చరెందిన జనరల్స్ మరణించారు..ఈ దాడి చేసింది ఇజ్రాయెలేనని ఇరాన్ మండిపడుతు,,ప్రతీకారం తీర్చుకుంటామని ప్రకటన కూడా వెలువరించింది..ఇజ్రాయెల్‌పై తాము చేయబోతున్న దాడికి అడ్డు రావొద్దంటూ అమెరికాకు ఇరాన్ లేఖ కూడా రాసిన విషయం విదితమే.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *