తెలంగాణలో 32 స్థానాల్లో పోటీ చేయనున్న జనసేన
హైదరాబాద్: తెలంగాణలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించింది..తెలంగాణలో 32 స్థానాల్లో జనసేన పోటీ చేయనున్నట్లు తెలంగాణ జనసేన విభాగం ప్రకటన చేసింది..ఒకవేళ చివరి క్షణంలో పొత్తులు ఉంటే స్థానాల్లో మార్పు రావచ్చని, ఒంటరిగా వెళ్లడానికి తాము సిద్ధంగా ఉన్నామని జనసేన ఉపాధ్యక్షుడు మహేందర్ రెడ్డి ప్రకటించారు.. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలను నెరవేర్చడమే తమ పార్టీ లక్ష్యమని జనసేన తెలంగాణ శాఖ తెలిపింది.. ఒకవేళ చివరి క్షణంలో పొత్తులేమైనా ఉంటే ఈ స్థానాల్లో మార్పులు ఉండవచ్చని పేర్కొంది.