AMARAVATHINATIONAL

సహజీవనంలో ఉండాలనుకునే వారు ప్పనిసరిగా ప్రభుత్వం వద్ద రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందే

అమరావతి: సహజీవనంలో ఉండాలనుకునే వారు, ఇప్పటికే ఉన్నవారు తప్పనిసరిగా ప్రభుత్వం వద్ద రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందే ఇలాంటి నిబంధనలతో ఉమ్మడి పౌర స్మృతి బిల్లు (UCC)ను ఉత్తరాఖండ్ అసెంబ్లీలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి మంగళవారం ప్రవేశపెట్టగా,,బిల్లును రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది..ఈ బిల్లు చట్ట రూపంలోకి వచ్చిన తరువాత ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రజలందరికీ యూసీసీ నిబంధనలు వర్తించనున్నాయి..ఈ చట్టాలకు మతపరమైన అధికారాలు ఉండవు.. పెళ్లి, విడాకులు, వారసత్వం, దత్తత లాంటి వ్యక్తిగత విషయాల అంశంలో ఉమ్మడి పౌర స్మృతి బిల్లు కీలకం కానున్నది..ఉమ్మడి పౌరస్మృతి బిల్లు అమల్లోకి వస్తే,,సహజీవనంలో ఉండాలనుకునే వారు, ఇప్పటికే ఉన్నవారు తప్పనిసరిగా ప్రభుత్వం వద్ద రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందే.. ఎవరైతే ఈ చట్టం నిబంధనలను పాటించరో వారికి ఆరు నెలల జైలు శిక్ష విధించడంతో రూ. 25 వేలు జరిమానా విధించనున్నారు.. యూసీసీ బిల్లు ప్రకారం 21 సంవత్సరాల లోపు యువతి,,యువకులు సహజీవనం చేయాలనుకుంటే తల్లిదండ్రుల ఆమోదం తప్పనిసరిగా పొంది ఉండాలి..అలాగే ప్రభుత్వం వద్ద రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.. సహజీవనంలో ఉండి విడిపోతే బాధితురాలు కోర్టును ఆశ్రయించొచ్చు.. మెయింటెనెన్స్ కూడా సొందేందుకు ఆమె అర్హురాలిగా బిల్లులో పేర్కొన్నారు..లివిన్ రిలేషన్షిప్ లో ఉన్న బిడ్డ జన్మిస్తే,, అతని చట్టబద్దమైన బిడ్డగా ప్రకటిస్తారు..సహజీవనం వద్దనుకున్నప్పుడు కూడా తప్పనిసరిగా వారు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలి..

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *