ఇంకొక ఆరు నెలలే,మన కష్టాలన్ని తీరిపోతాయి-శ్రీధర్ రెడ్డి
నేను ఎవరికి భయపడను..
నెల్లూరు: సమస్యలు పరిష్కరించాలని పోరాటం చేస్తుంటే,రాజ్యధికారం వుంది కదా అని నా మీద కేసులు పెట్టిన,జైళ్లకు పంపిన భయపడే ప్రసక్తే లేదని,,అలాంటి వాటిని నేను కాలేజ్ చదువుకునే రోజుల్లోనే చూశానని వైసీపీ నెల్లూరు రూరల్ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు.శనివారం రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో నెల్లూరు రూరల్ ప్రజల నిరసన గొంతుక పేరిట నిరసన కార్యక్రమంలో అయన మాట్లాడుతూ పొట్టేపాలెం కలుజు మీద వంతెన లేకపోడడంతో ఈ దారిన ప్రయాణించే ప్రజలు ప్రమాదాలబారిన పడుతున్నారన్నారు..ఈ సమస్య పరిస్కారం కోసం ముఖ్యమంత్రి దగ్గర నుంచి మంత్రుల వరకు 50, 60 సార్లు వెళ్ళా..కానీ ఇప్పటికి ఈ సమస్య పరిష్కారంకాని పరిస్థితి వుందన్నారు..ఈ సమస్య పరిష్కారించాలని, దాదాపు 1 1/2 సంవత్సరం క్రితం ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డిని సదరు దారి వద్ద తీసుకొనిపోయి చూపించడం జరిగిందన్నారు.. పొట్టేపాళెం కలుజుమీద వంతెన, ములుముడి కలుజు మీద వంతెన,,ములుముడి-తాటిపర్తి రోడ్డు ఆధునీకరణకు 28 కోట్ల రూపాయలు మంజూరు చేశారని తెలిపారు..ఇప్పటి వరకు ఆ నిధులు విడుదల కాలేదని చెప్పారు.