ఒడిశా నుంచి రాజ్యసభ బరిలోకి మంత్రి అశ్విని వైష్ణవ్
అమరావతి: ఒడిశా నుంచి రాజ్యసభ ఎన్నికలో నిలుస్తున్న బీజేపీ అభ్యర్థికి,,బీజూ జనతాదళ్ అధినేత నవీన్ పట్నాయక్ మద్ధతు ప్రకటించారు..కేంద్ర రైల్వే, టెలికాం శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఒడిశా నుంచి రాజ్యసభకు పోటీ చేస్తున్నారు..అశ్విని వైష్ణవ్ రాజ్యసభ పదవీకాలం ముగియనుడడంతో మరోసారి ఒడిశా నుంచి బీజేపీ అవకాశం కల్పించింది..అశ్విని వైష్ణవ్ అభ్యర్థిత్వాన్ని బీజేపీ బుధవారం ఉదయం అధికారికంగా ప్రకటించింది..2019లో ఆయన తొలిసారి ఒడిశా నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు..అప్పట్లో కూడా బీజేడీ ఆయనకు మద్ధతిచ్చింది.. రాజకీయాల్లోకి రాకముందు ఒడిశా క్యాడర్ ఐఏఎస్ అధికారిగా అశ్వని వైష్ణవ్ పనిచేశారు..పలు కీలక అంశాల్లో కేంద్ర ప్రభుత్వానికి నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని బీజేడీ మద్ధతు ఇస్తోంది..ఖాళీ అయిన రాజ్యసభ స్థానాలకు ఫిబ్రవరి 27న ఎన్నికలు జరగనున్నాయి.. అదే రోజు సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు చేపడతారు.. ఫిబ్రవరి 15 నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ.. నామినేషన్ల ఉపసంహరణకు ఫిబ్రవరి 20 వరకు గడువు ఉంటుంది.. 15 రాష్ట్రాలకు చెందిన 56 మంది రాజ్యసభ సభ్యుల పదవీకాలం ఏప్రిల్ నెలతో ముగియనుంది.