తేజస్ యుద్ధ విమానంలో ప్రయాణించిన ప్రధాని మోదీ
అమరావతి: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ సంస్థను సందర్శించిన సందర్భంలో తేజస్ యుద్ధ విమానంలో ప్రయాణించారు..HAL కేంద్రం వద్ద జరుగుతున్న వివిధ ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించారు..పైలెట్ దుస్తులు ధరించి తలకు హెల్మెట్ పెట్టుకొని తేజస్ ఫైటర్ జెట్ లో ప్రయాణించిన ఫొటోలను తన ఖాతాలో పోస్టు చేశారు.. తేజస్ ఫైటర్ జెట్ల తయారీ భారతదేశానికి అద్భుతమైన విజయమని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నారు..తేజస్ పై ఒక ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేశారు..‘‘ తేజస్ ఫైటర్ జెట్ లో ప్రయాణం చేసిన అనుభవం అద్భుతంగా ఉంది.. మన స్వదేశీ సామర్ధ్యాలపై నా విశ్వాసాన్ని తేజస్ పెంచింది’’ అని నరేంద్రమోదీ ట్వీట్టర్ లో పోస్టు చేశారు.
స్వదేశంలోనే రక్షణ ఉత్పత్తులు:- రక్షణ ఉత్పత్తులను స్వదేశంలో ఉత్పత్తి చేసేందుకు ప్రధాని మోదీ తీసుకున్న చర్యలు కారణంగా USA డిఫెన్స్ దిగ్గజ సంస్థ GE ఏరోస్పేస్,,HALతో కలిసి సంయుక్తంగా MK-తేజస్ ఫైటర్ జెట్ తయారీ కోసం ఇంజన్లను ఉత్పత్తి చేసింది.. 2022-2023వ ఆర్థిక సంవత్సరంలో భారతదేశ రక్షణ ఎగుమతులు రూ.15,920 కోట్లకు చేరాయి,