AMARAVATHIHYDERABADPOLITICS

డబుల్ ఇంజన్ సర్కార్ తోనే యు.పీలో అవినితి ప్రక్షాళన చేశాం-యోగి

హైదరాబాద్: డబుల్ ఇంజన్ సర్కార్ తోనే తెలంగాణలో పరిస్థితులు మారుతాయని,, తెలంగాణ తరహాలో అవినీతి, అక్రమాలతో ఉన్న ఉత్తరప్రదేశ్ ను ప్రధాని నాయకత్వంలో డబుల్ ఇంజన్ సర్కార్ తో ప్రక్షాళన చేశామని యు.పి. ముఖ్యమంత్రి యోగి అధిత్యనాథ్ చెప్పారు..శనివారం తెలంగాణలో పలు ప్రాంతాల్లో సూడిగాలి సభలు నిర్వహించారు.. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు కలసి ప్రజలను మోసం చేస్తున్నాయని ఆరోపించారు.. బీఆర్ఎస్ పార్టీ, ముస్లింలతో కలసి బలాన్ని పెంచుకొని ప్రజలను మోసం చేస్తుందని విమర్శించారు.. నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో తెలంగాణ రాష్ట్రం సాధించుకుని,, తెలంగాణ వచ్చిన తరువాత తన కుటుంబ అభివృద్ది మాత్రమే కేసీఆర్ ప్రాధన్యం ఇచ్చాడని అన్నారు.. ఉత్తరప్రదేశ్ లో ప్రస్తుతం డబల్ ఇంజన్ సర్కారు పనిచేస్తుందని,, అభివృద్దిలో యూ.పి బుల్లెట్ వేగంతో పని చేస్తుందని తెలిపారు.. మోదీ నేతృత్వంలో భారత దేశం ప్రపంచ వేదికలపై తలెత్తుకొని తిరిగే పరిస్థితి వచ్చిందన్నారు..2024లో మోదీ నేతృత్వంలో అయోధ్యలో హిందూత్వ పూజలు చేసుకుంటామని తెలిపారు..తెలంగాణలో బీజెపీని గెలిపిస్తే, ప్రజలకు ఉచితంగా అయోధ్య రామమందిరం దర్శనం కల్పిస్తామని హామీ ఇచ్చారు.. ఇక్కడి సంస్కృతి,,సంప్రదాయం,, మానవత్వం తనకు ఎంతగానో నచ్చాయని యోగి ఆదిత్యనాథ్ అన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *