AMARAVATHINATIONAL

మరో వివాదంలో చిక్కుకున్న రాహుల్ గాంధీ,మహిళా ఎంపీల వైపు చూస్తూ ఫ్లయింగ్ కిస్

అమరావతి: మోదీ అనే ఇంటి పేరు పరువు నష్టం కేసు నుంచి బయట పడి నేడు పార్లమెంట్ కి వచ్చిన రాహుల్ గాంధీ మరో వివాదంలో చిక్కుకున్నారు..లోక్ సభ నుంచి వెళ్లిపోతూ ఆయన మహిళా ఎంపీల వైపు చూస్తూ ఫ్లయింగ్ కిస్ ఇచ్చారని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఆరోపించారు..మహిళలంటే ఇష్టపడనివారు మాత్రమే ఇటువంటి పనులు చేయగలరని ఆగ్రహం వ్యక్తం చేశారు..ఈ విషయమై మహిళా మంత్రులు,,ఎంపీలు ఆయనపై లోక్ సభాపతి ఓం బిర్లాకు ఫిర్యాదు చేశారు..ఈ ఆరోపణలలో వాస్తవాన్ని గుర్తించేందుకు అధికారులు సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు..

 ‘‘ఓ విషయంలో నాకు చాలా అభ్యంతరం ఉంది..నా కన్నా ముందు మాట్లాడిన వ్యక్తి సభ నుంచి వెళ్లిపోతూ అసభ్యకరంగా ప్రవర్తించారు..మహిళలంటే ఇష్టపడనివారు, మహిళల పట్ల వ్యతిరేక భావం కలవారు మాత్రమే ఈ విధంగా మహిళా సభ్యులు ఆశీనులయ్యే పార్లమెంటులో ఫ్లయింగ్ కిస్ ఇవ్వగలరు.. హుందాతనంలేని ఇటువంటి ప్రవర్తన మన దేశ పార్లమెంటులో మునుపెన్నడూ కనిపించలేదు’’ అని స్మృతి ఇరానీ ఆరోపించారు.

(రాహుల్ గాంధీ ఈ విధంగా ప్రవర్తించడం కొత్త విషయం కాదు..2018లో ఎన్డీయే ప్రభుత్వంపై ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి..ఆ తీర్మానంపై చర్చ సమయంలో మోదీని ఆయన కౌగిలించుకుని,,ఆ తర్వాత ప్రక్కనే వున్న వారిని చూసి కన్ను కొట్టారు).

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *