AMARAVATHIPOLITICS

జనసేనలోకి పెరుగుతున్న చేరికలు- కొణతాల, పృథ్వీరాజ్

అమరావతి: సర్వత్రిక ఎన్నికలు  దగ్గర పడుతున్న కొద్ది రాజకీయ పార్టీల్లోకి చేరికలు,, వలసల పర్వం క్రమేణ పెరుగుతున్నాయి..ఈ నేపధ్యంలో సినీ నటుడు, గతంలో వైసీపీకి రాజీనామా చేసిన పృథ్వీరాజ్, బుధవారం మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సమక్షంలో పార్టీలో చేరారు.. పవన్ కల్యణ్ పార్టీ కండువాను కప్పి సాదరంగా ఆహ్వానించారు.. TTDకి చెందిన SVBC TV  ఛానల్ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తించారు..అంతర్గత పోరు కారణంగా ఓ వివాదం అయనను చుట్టు ముట్టడడంతో ఆయనపై వైసీపీ వేటు వేసింది..

మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ:- అలాగే మంగళగిరి జనసేన కార్యాలయంలో ఆ పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌తో మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ సమావేశమై పలు అంశాలపై చర్చించారు..అనకాపల్లిలో నిర్వహించనున్న బహిరంగసభ, ఉత్తరాంధ్ర అంశాలపై చర్చించినట్లు సమాచారం..అనంతరం కొణతాల మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఉత్తరాంధ్ర సమస్యలపై పవన్‌తో చర్చించామని చెప్పారు.. ఉత్తరాంధ్రను దత్తత తీసుకోవాలని కోరానని తెలిపారు..అనకాపల్లిలో బహిరంగ సభ వచ్చేనెల 2 లేదా 4 తేదీల్లో ఉండొచ్చని వెల్లడించారు..తాను ఇప్పటికే జనసేనలో చేరినట్టేనని తెలిపారు.. ఉత్తరాంధ్ర నుంచే పవన్ కల్యాణ్ పోటీ చేస్తే చాలా మంచిదన్నారు.. ఏపీసీసీ అధ్యక్షురాలి హోదాలో షర్మిల తనను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారని,,అయితే తాను జనసేనలో చేరుతుండడం కాంగ్రెస్ పార్టీలోకి రాలేనని చెప్పానని తెలిపారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *