AMARAVATHINATIONAL

బెంగుళూరులో తీవ్ర నీటి కొరత,అడుగంటిన భూగర్భ జలాలు

అమరావతి: గతంలో ఎన్నడు లేనటువంటి నీటి సమస్యను వేసవికాలం రాక ముందే బెంగళూరు సిటీ వాసులు ఎదుర్కొంటున్నారు..గార్డన్ సిటీగా పేరు వున్న బెంగుళూరు నగరం,,ప్రస్తుతం కాంక్రీట్ జంగిల్ గా మారిపోయింది.. నగరంలో వీపరితంగా అపార్ట్ మెంట్స్,,షాపింగ్ మాల్స్ నిర్మాణాలు జరగడంతో,, క్రమేపీ భూగర్భజాలలు అడుగంటి పోవడం మొదలైంది..ఈ విషయంపై బెంగుళూరు నగరపాలక సంస్థ ఎలాంటి ముందస్తూ జాగ్రత్తలు తీసుకోలేదని,,నేటి పరిస్థితి స్పష్టం చేస్తొంది..బెంగుళూరు నగరంలో గత రెండు వారాల నుంచి నీటి సమస్య తీవ్రంగా పెరిగిపోయింది.. అపార్ట్ మెంట్స్ లో నీటి కొరత ఏర్పాడడంతో,,ట్యాంకర్స్ తో నీటిని రప్పించి జాగ్రత్తగా వాడుకోవాల్సి పరిస్థితి దాపురించింది..కర్ణాటక ఉపముఖ్యమంత్రి డి.కె శివకుమార్ సైతం తమ ఇంటిలో కూడా నీటి సమస్య వుందని స్వయంగా చెప్పడం గమనించాల్సి అంశం.. భూగర్భ జలాలు అడుగంటడంతో సంక్షోభానికి దారితీసిందని నగర వాసులు తమ బాధలను సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు..చాలా కాలనీల్లో మున్సిపల్ వాటర్ ట్యాంకుల వద్ద పొడవైన క్యూలు ఇప్పుడు సాధారణంగా మారాయి..కరవు పరిస్థితులపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. “వేసవి కాలం ప్రారంభం కాలేదు. అయినా బెంగళూరులో నీటి కొరత వచ్చిందంటూ పోస్టులు పెడుతున్నరు..

ప్రస్తుతం బెంగళూరు నగరంలో కార్ వాషింగ్,, గార్డెనింగ్,, నిర్మాణం,, వాటర్ ఫౌంటైన్లు,, రోడ్ల నిర్మాణం వంటి పనులకు తాగునీటిని ఉపయోగించడాన్ని ప్రభుత్వం నిషేధించింది..నిబంధనలు ఉల్లంఘిస్తే రూ.5 వేల జరిమానా విధిస్తామని కర్ణాటక నీటి సరఫరా, మురుగునీటి బోర్డు ప్రకటించింది..బోర్‌వెల్‌లు ఎండిపోవడంతోనే నీటి ఎద్దడి ఏర్పడిందని, వర్షాభావ పరిస్థితుల వల్ల భూగర్భ జలాలు అడుగంటాయని నిపుణులు పేర్కొంటున్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *