AMARAVATHITECHNOLOGY

జియో స్పేస్ ఫైబర్ పేరుతో సరికొత్త ఇంటర్ నెట్ సేవలు

అమరావతి: రిలయన్స్ ఇండస్ట్రీస్, జియో స్పేస్ ఫైబర్ పేరుతో భారత్ లో మరో సరికొత్త ఆవిష్కరణకు వేదిక సిద్ధం చేసింది.. శాటిలైట్ ఆధారిత ఇంటర్నెట్ సేవలను అందించనున్నారు..శుక్రవారం ఢిల్లీలో జరిగిన ఇండియా మొబైల్ కాంగ్రెస్ 7వ ఎడిషన్లో జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ చైర్మన్ ఆకాష్ అంబానీ మాట్లాడుతూ జియో స్పేస్ ఫైబర్ తో దేశంలోని ప్రతి ఒక్కరిని విద్య, ఆరోగ్యం, వినోదం, ప్రభుత్వ సేవలను ఆన్ లైన్ ద్వారా పొందేందుకు వీలు కల్పిస్తుందన్నారు.. గిగాబిట్ యాక్సెస్ తో ప్రతి ఒక్కరూ, ప్రతిచోటా, కొత్త డిజిటల్ కనెక్ట్ విటీలో భాగస్వామ్యలు అవుతారని,,దేశంలోని చాలా మంది తొలిసారి ఇంటర్నెట్ సేవలను పొందనున్నారు’ వెల్లడించారు.. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రధాని నరేంద్ర మోదీ, జియో స్పేస్ ఫైబర్ వ్యవస్థ ఎలా పనిచేస్తుందో పరిశీలించారు..దేశంలోని ప్రతీ ఇంటికి ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చేలా ఈ టెక్నాలజీని ఉపయోగించనున్నారు..ఈ సేవలను పరీక్షించే క్రమంలో రియలన్స్ ఇప్పటికే, గిర్-గుజరాత్,, కోర్బా-ఛత్తీస్ గఢ్, నబ్రంగ్ పూర్-ఒడిశా, ONGC-జోర్హాట్ అసోం ప్రాంతాల్లో సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది..ఇందు కోసం జియో సరికొత్త మీడియం ఎర్త్ ఆర్బిట్(MEO) ఉపగ్రహ సాంకేతికతను SES సహకారంతో పనిచేస్తుందని అయన తెలిపారు..

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *