AMARAVATHIDISTRICTS

జనసేనాని హెచ్చరికతో దిగి వచ్చిన ప్రభుత్వం,రాజోలు రోడ్డుకు మరమ్మత్తులు

అమరావతి జనసేనాని హెచ్చరికతో దిగి వచ్చిన ప్రభుత్వం,,కోనసీమ జిల్లా రాజోలు, ఎల్ఐసి బైపాస్ రహదారి పనులు ఆదివారం ఎట్టకేలకు ప్రారంభం అయ్యాయి..గత కొంతకాలంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో రోడ్లు పరిస్థితులపై జనసేన నాయకులు కార్యకర్తలు ప్రభుత్వాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రశ్నిస్తూనే ఉన్నారు..కొన్ని ప్రదేశాలలో స్వయంగా జనసైనికులు శ్రమదానం చేస్తూ రోడ్ల మరమ్మతు పనులు పూర్తి చేస్తున్నారు..వారాహి యాత్రలో భాగంగా ఉభయ గోదావరిలోని వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తూ కోనసీమ జిల్లా మలికిపురంలో పవన్ నిర్వహించిన బహిరంగ సభలో రాజోలు బైపాస్ రహదారిపై పవన్ కళ్యాణ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.. ప్రభుత్వం స్పందించి 15 రోజుల్లో రోడ్ల మరమ్మతు పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు..ప్రభుత్వం స్పందించి రోడ్డు పనులు చేపట్టకపోతే జనసైనికులతో కలిసి తానే స్వయంగా శ్రమదానం చేసి రోడ్డు పనులు పూర్తి చేస్తాన్నాని ప్రభుత్వాన్ని హెచ్చరించారు..ఈ నేపథ్యంలో ప్రభుత్వంలో స్పందన మొదలైంది..గత నాలుగు సంవత్సరాలుగా రాజోలు ఎల్ఐసి బైపాస్ రహదారి గుంతలతో అధ్వానంగా మరి ప్రమాదాలకు నిలయంగా ఉందని స్థానికులు పేర్కొన్నారు.. పవన్ కళ్యాణ్ హెచ్చరికలతో రహదారి పనుల్లో కదలిక వచ్చిందని స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు..ప్రతి రోజు ఈ రోడ్డు ద్వారా అనేక వాహనాలు ప్రయాణిస్తున్న నేపద్యంలో రోడ్డు పరిస్థితి అధ్వానంగా ఉందని అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా కనీసం స్పందించలేదని తెలిపారు..పవన్ కళ్యాణ్ అల్టిమేటంతో అధికార పార్టీతో పాటు అధికారుల్లో చలనం వచ్చిందని స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు..

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *