జనసేన పార్టీకి మనుక్రాంత్ రెడ్డి రాజీనామా-వైసీపీలో చేరేందుకు రంగం సిద్దం
నెల్లూరు: జనసేనపార్టీలో తను ఇమడలేక పోతున్నాను అని,అందువల్ల జనసేనపార్టీకి రాజీనామ చేస్తున్నట్లు మనుక్రాంత్ రెడ్డి ప్రకటించారు.బుధవారం అయన స్వగృహాంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన సందర్బంలో అయన మాట్లాడుతూ వైసీపీలోకి ఆహ్వానించి ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి, రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల, జిల్లా అధ్యక్షులు పర్వతరెడ్డి, సిటీ అభ్యర్థి ఖలీల్ తదితరులకు ధన్యవాదల తెలిపారు.రెండు మూడు రోజుల్లో వైసీపీలో చేరుతాను అని చెప్పారు.తనకు గుర్తింపు నిచ్చి, అవకాశం కల్పించిన సీయం జగనన్నకు కృతజ్ఞతలు తెలిపారు.