మాగుంట రాఘవరెడ్డి మధ్యంతర బెయిల్ రద్దు చేసిన సుప్రీమ్ కోర్టు
అమరావతి: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో నిందితుడు అయిన మాగుంట రాఘవరెడ్డి మధ్యంతర బెయిల్ రద్దు చేస్తు,,జూన్ 12వ తేదిన సరెండర్ కావాలని సుప్రీంకోర్టు ఆదేశించింది..మాగుంట రాఘవరెడ్డికి ఈ నెల 7వ తేదిన హైకోర్టు వేకేషన్ బెంచ్ రెండు వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది..ఢిల్లీ హైకోర్టు తీర్పును ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ సుప్రీంలో సవాలు చేసింది..ఈ పిటిషన్ పై సుప్రీం కోర్టులో శుక్రవారం విచారణకు జరుగగా, రాఘవరెడ్డి మద్యంతర బెయిల్ రద్దు చేస్తూ తీర్పునిచ్చింది..తన అమ్మమ్మ బాత్ రూమ్ లో జారిపడిందని,,అమె అనారోగ్యం కారణంగా రాఘవరెడ్డికి ఢిల్లీ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది..దీన్ని సవాల్ చేస్తూ ఈడీ సుప్రీం కోర్టును ఆశ్రయించింది..మధ్యంతర బెయిల్ కోసం రాఘవరెడ్డి చూపిన కారణాలు సరైనవి కాదని ఈడీ తరపున అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఎస్ ఏ రాజు న్యాయస్థానానికి వివరించారు..వాదనలు ఆలకించిన సుప్రీం కోర్టు రాఘవకు బెయిల్ రద్దు చేసింది.