తిరుపతిలో గాలివాన బీభత్సం-చెట్టు కూలి ఒకరు మృతి
తిరుపతి: రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ఆకస్మికంగా ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది..తిరుపతిలో గాలివాన బీభత్సం సృష్టించింది..మధ్యహ్నం దాదాపు 20 నిమిషాలపాటు భీకరంగా గాలులు వీచాయి..నగరంలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయ సమీపంలోని వందల సంవత్సారల నాటి మర్రి చెట్టు కూలిపోయింది..దీంతో ఒకరు మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి..అలాగే బాపట్ల జిల్లా వేటపాలెం మండలం కొత్తపేటలో ఈదురుగాలులతో భారీ వర్షం కురిసింది..ఈదురుగాలుల కారణంగా కొత్తపేటలోని ఓంకార క్షేత్రంలో ధ్వజస్తంభం విరిగిపడింది..నైరుతి రుతుపవనాలు ప్రవేశించకముందే తెలుగు రాష్ట్రాల్లో ఈదురు గాలులతో భారీ వర్షాలు బీభత్సవం సృష్టింస్తొంది.